Tuesday, May 7, 2024

CBN : నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ

అమరావతి, న‌వంబ‌ర్ 9(ప్ర‌భ‌న్యూస్‌) టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు..ఈ మేరకు కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అభియోగాలు ఎదుర్కొంటున్న ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది.

ఇది ఇలావుంటే 17- ఏ పై చంద్రబాబు దాఖలు చేసిన పిల్ పై తీర్పు పెండింగ్‌లో ఉంది. ఇక, నేడు లేదా రేపు 17 ఏ చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 17 ఏపై కేసులో తీర్పు పెండింగ్ నేపథ్యంలో పైబర్ నెట్ కేసును గతంలో ఈ రోజు కు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం వాయిదా వేసిన విషయం విదితమే.
ధర్మాసనం గతంలో పేర్కొన్నట్లు 17-ఏ కేసులో ఇప్పటి వరకు తీర్పును వెలువరించలేదు. ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జాబితాలోనూ ఈ కేసు లిస్ట్‌ కాలేదు.ఈ నేపథ్యంలో నేడు ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ అంశంపై నిర్ణయం వెల్లడిస్తారా?.. లేక 17-ఎ కేసులో తీర్పు వచ్చే వరకూ ప్రస్తుతం ఉన్న ఆదేశాలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement