Tuesday, April 30, 2024

Amaravathi – చంద్రబాబు నివాసంలో ముగిసిన చండీయాగం, సుదర్శన నారసింహ హోమం

అమరావతి:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నేటితో ముగిశాయి. శుక్రవారం నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా పలు యజ్క్ష క్రతువులు నిర్వహించారు. నేటి మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని….రాష్ట్ర ప్రజలకు అందరికీ మేలు జరగాలని చంద్రబాబు నాయడు ఆకాంక్షించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు పి.శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు అత్యంత వైభవంగా యాగం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడతో పాటు…కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement