Sunday, April 28, 2024

వివేకా హత్య కేసులో కొడాలిని సీబీఐ విచారించాలి.. బుద్దా వెంకన్న

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిని విచారించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న కోరారు. వివేకా హత్యకేసులో కొడాలి నానికి కీలక విషయాలు తెలుసని బుద్దా వెంకన్న అన్నారు. నానికి నాలుగు తగిలిస్తే వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయన్నారు. వైఎస్ కుటుంబంలో కొడాలి నాని చిచ్చు పెడుతున్నాడన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కోసమే కొడాలి నాని ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేస్తే.. గతిలేక కొడాలి నాని వైసీపీలో చేరాడన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement