Sunday, April 28, 2024

విజయసాయి బెయిల్ రద్దు.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఈ రోజు మరోసారి విచారణ జరగనుంది. ఈ పిటిషన్ పై విజయసాయి కౌంటర్ దాఖలు చేయనున్నారు. విజయ సాయి బెయిల్ రద్దు అంశం పై కోర్ట్ విచక్షణకే సీబీఐ వదిలిపెట్టింది.

కోర్టు షరతులు ఉల్లంఘించినందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్, ఇతర నిందితులతో కలిసి విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను బెదిరిస్తున్నారని రఘురామ ఆరోపించారు. పిటిషన్‌పై ఈ నెల 13న సీబీఐ మెమో దాఖలు చేసింది. విచక్షణ మేరకు, చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిరెడ్డికి న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం విజయసాయి రెడ్డి దాఖలు చేసే కౌంటర్ పై వాదనలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement