Friday, May 17, 2024

కర్నూలు వ‌న్ టౌన్ ప‌రిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ …

క‌ర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూల్ సబ్ డివిజన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కర్నూలు పట్టణ డిఎస్పీ కె విజయ శేఖర్ ఆధ్వర్యంలో కర్నూల్ వన్ టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ గృహాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ దాడులలో సరైన ధృవ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కర్నూల్ వన్ టౌన్ సిఐ నాగ శేఖర్, ఎస్సైలు జాఫర్, నాగరాజు, బాల నరసింహులు, మధుసూదన్, రాముడు మరియు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement