Saturday, May 11, 2024

కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించాలి.. మంత్రి రజినిని కోరిన‌ ఎంపీ సంజీవ్

కర్నూలు, (ప్రభ న్యూస్) : కర్నూలు సర్వజన ఆస్పత్రిలో నిర్మితమవుతున్న జిల్లా కేన్సర్ ఆస్పత్రిని త్వరితగతిన ప్రారంభించాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కోరారు. శుక్రవారం విజయవాడలో మంత్రి రజినిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జోన్ లోనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పెద్దదని, దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి, కర్నూలు రీజినల్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి చర్చించారు.

అత్యాధునిక పరికరాలను విదేశాల నుండి త్వరగా దిగుమతి చేసి కేన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించాలని ఎంపీ సంజీవ్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే కర్నూలులో కేన్సర్ హాస్పిటల్ ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement