Sunday, April 28, 2024

AP : పిఠాపురంలో సీఎం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌

సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

- Advertisement -

ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం ఎస్టి రాజపురం రాత్రి బస చేసిన నుంచి బయలుదేరుతారు జగన్. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్.

అనంతరం ముందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా మూడున్నర గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం బైపాస్ దగ్గర మాట్లాడుతారు. ఇక గొడిచర్ల క్రాస్ వద్ద రాత్రి అక్కడే బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement