Friday, May 3, 2024

స్కూటీ – లారీ ఢీ…అన్నదమ్ములు మృతి…

చిలకలూరిపేట,ఆగస్టు 14(ప్రభ న్యూస్) : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన గుంటూరు చిలకలూరిపేట జాతీయ రహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో ఉన్న కృష్ణగంగ స్పిన్నింగ్ మిల్ వద్ద చోటు చేసుకుంది. సోమవారం ఉదయం చిలకలూరిపేట మండలం కట్టుబడి వారి పాలెం గ్రామానికి చెందిన మోపూరు రమేష్ బాబు(31) మోపూరు బాలకృష్ణ(28) ఇద్దరు అన్నదమ్ములు స్కూటీపై చిలకలూరిపేట నుండి గుంటూరు రైల్వే స్టేషన్ కి వెళుతుండగా కృష్ణ గంగ స్పిన్నింగ్ మిల్ వద్దకు రాగానే గుంటూరు వెళుతున్న ఐచర్ లారీ స్కూటీని వెనకనుండి గట్టిగా ఢీకొట్టడంతో స్కూటీ మీద ఉన్న ఇద్దరు రోడ్డుపై పడ్డారు.

ఆయువకులను లారీ ఎక్కి తొక్కింకి 50 అడుగుల మేర ఇద్దరు యువకులను తీర్చుకొని వెళ్ళింది. ఇద్దరు యువకులు తలలు నుజు నుజ్జు అవటంతో అక్కకుడే మృతి చెందారు. మృతి చెందిన యువకులను పోస్టుమార్ట్ నిమిత్తం యడ్లపాడు పోలీసులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాద వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో తల్లిదండ్రులు, ముతుడు రమేష్ భార్య, బంధువులు శోకసముద్రంలో విలవిలలాడారు కట్టుబడి వారి పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మోపురి రమేష్ బాబుకి గత రెండు సంవత్సరాల క్రితం వివాహం అయింది. అతనికి ఆరు నెలల పాప కలదు. మోపురి బాలకృష్ణ కి ఈ మధ్యనే సొంత అక్క కూతురితో వివాహం నిశ్చయమైనది వచ్చే శ్రావణమాసంలో వివాహం జరగాల్సి ఉంది. మృతుల తల్లిదండ్రులు మోపురి చిన్న కృష్ణారావు గోవిందములకు ముగ్గురు సంతానం. మొదటి సంతానం కూతురు కాగా ఇరువురు కుమారులు మృతి చెందారు. మోపురి రమేష్ బాబు వైజాగ్ లో సి ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మోపురి బాలకృష్ణ చిలకలూరిపేట నియోజకవర్గం లోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో రైల్వే గేట్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు అకస్మాత్తుగా ప్రమాదంలో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతే లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement