Sunday, April 28, 2024

Breaking News గాజువాకలో చంద్ర బాబు పై రాళ్ళ దాడి

విశాఖ – ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.ఈ రాళ్లు సభలో ఎవరికి తగలలేదు. బాబు ప్రసంగం కొనసాగుతునే ఉంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడున్న తెలుగు తమ్ముళ్లు రాయి విసిరిన ఆకతాయిలను పట్టుకు కున్న్నారు

.

కాగా, . పోలీసుల వైఫల్యంతోనే ఈఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో, ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై రాళ్లు వేయడంతో భద్రతను పోలీసులు వైఫల్యం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. నిన్న చీకటిలో గులక రాయిని వేశారని .. ఇప్పుడు వెలుగులో రాళ్లు వేశారని చెప్పారు. రాళ్ల దాడి చేస్తోంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే విశాఖ పోర్టుకు డ్రగ్స్ దిగుమతి అయ్యాయయని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్ అక్రమరవాణాలో ప్రభుత్వమే దోషి అని చెప్పారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement