Sunday, April 28, 2024

Boycott – మేం ఓట్లేయం..! స్వయంభువరం గ్రామస్తుల తీర్మానం

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని మూల స్వయంభువరం గ్రామ ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దశాబ్దాలుగా పరవాడ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కర్మాగారం నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, కాలుష్యం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా గ్రామాన్ని తరలించాలని పాలకులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన తొలి గ్రామం ఇదే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement