Monday, May 6, 2024

నీటి డ్ర‌మ్ములో ప‌డి బాలుడి మృతి.. క‌ర్నూలు జిల్లాలో ఘ‌ట‌న‌

నందికొట్కూరు (ప్రభ న్యూస్) : నీటి డ్ర‌మ్ములో ప‌డి ఓ బాలుడు చ‌నిపోయిన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. నందికొట్కూరు మండలం మాల్యాల గ్రామానికి చెందిన‌ కురువ రవి, హేమలత దంపతులకు ఇద్దరు కుమారులు. వారి చిన్న కొడుకు రోహిత్ (6) ఇవ్వాల ఉదయం ఆడుకుంటూ ఇంటి ముందున్న‌ నీటి డ్రమ్ములో పడిపోయాడు. ఇది గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆ బాలుడిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. అప్ప‌టికే అత‌ను నీళ్ల‌లో మునిగి ఊపిరాడ‌క ప్రాణాలు వ‌దిలాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement