Sunday, April 28, 2024

కేబినెట్ నిర్ణయాన్ని సీఎం కూడా మార్చలేరు: బొత్స

విశాఖలో భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తప్పులను సరిదిద్దుతుంటే తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన టీడీపీ నేతలే ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ సందేహాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖ భూములు కేబినెట్ నిర్ణయంతోనే జరిగాయని తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని సీఎం కూడా మార్చలేరని చెప్పారు. స్టాంప్ డ్యూటీ నష్టం జరిగిందా లేదా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉందని మంత్రి బొత్స తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement