Sunday, May 5, 2024

Missing | తిరుమల కొండపై బోథ్ వాసి మిస్సింగ్​.. ఆందోళ‌న‌లో కుటుంబం

బోథ్, (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణానికి చెందిన వ్య‌క్తి తిరుమ‌ల కొండ‌పై త‌ప్పిపోయిన‌ట్టు పోలీసుల‌కు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బోథ్ నుంచి తిరుమ‌ల‌కు 10మంది మొన్న‌ (శనివారం) వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకున్న అనంతరం దైవ దర్శనానికి క్యు లైన్లో ఉన్నారు. ఈ క్ర‌మంలో పిట్లా బాపురావు అనే వ్యక్తి సోమవారం క్యు లైన్లో తప్పి పోయాడు.

ఇది గమనించిన గ్రూప్ సభ్యులు టీటీడీ అధికారులకు సమాచారం అందించి వారి సహకారంతో బాపురావు ఆచూకీ కోసం వెతికారు. అయినా అత‌ని ఆచూకీ దొర‌క్క‌పోవడంతో. తిరుమల కొండపై ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాపూరావు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విష‌యం తెలిసి బోథ్ లో ఉన్న బాపురావు భార్య, బిడ్డలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement