Sunday, April 28, 2024

Murder: బొండపల్లి తహశీల్దార్ విశాఖలో దారుణ హత్య

విజయనగరం, ఫిబ్రవరి 3(ప్రభ న్యూస్): విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్ రమణయ్య కొమ్మాదిలో చొరన్ క్యాపిటల్ అపార్ట్ మెంట్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం రాత్రి అపార్ట్ మెంట్ లో నిద్రిస్తున్న రమనయ్యకు ఎవరో ఫోన్ చేసి కిందకు పిలిచి హత్య చేసినట్లు తెలుస్తోంది.

వాచ్మెన్ కేకలు వేయటంతో పరుగులు పెట్టిన దుండగులు. వెంటనే హాస్పటిల్ కి తరలించగా చికిత్స పొందుతూ బొండపల్లి తహశీల్దార్ రమణయ్య మృతి చెందారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన విశాఖపట్నం సీపీ రవి శంకర్ ఇంకా పూర్తి వివరాలు వెల్ల‌డించాల్సి ఉంది. నిజాయితీ పరుడుగా మంచి పేరు తెచ్చుకున్న రమణయ్య హత్యకి లాండ్ మాఫియా వివాదాలే కారణమని అనుమానిస్తున్నారు. నిందితులు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇటీవల విశాఖ పట్నం చిన్న గదిలీ నుంచి విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement