Monday, April 29, 2024

బొలెరో, బైక్​ ఢీకొన్న‌ ప్రమాదంలో యువకుడి మృతి..

జూపాడుబంగ్లా, (ప్రభా న్యూస్) : క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువకుడు చ‌నిపోయాడు. ఈ ఘ‌టన ఇవ్వాల జూపాడుబంగ్లా దగ్గర జరిగింది. ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామానికి చెందిన సుబ్బన్న (30) బైకుపై మిడుతూరు మండలం మీరు సాహెబ్ పేటలోని త‌న‌ భార్య దగ్గరకు వెళ్తున్నాడు. కర్నూల్ నుండి ఉల్లిగడ్డల లోడుతో గుంటూరు వెళ్తున్న బొలెరో వాహనం జూపాడు బంగ్లా సమీపంలో బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న జూపాడుబంగ్లా ఎస్సై వెంకట సుబ్బయ్య వారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యాక్సిడెంట్​ చేసిన బొలేరో వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement