Tuesday, May 21, 2024

AP: తిరుమల శ్రీవారి సేవలో భువనేశ్వరి.. రేపటి నుంచి నిజం గెలవాలి యాత్ర

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో యాత్ర నిర్వహించనున్నారు. నిన్న తిరుపతి చేరుకున్న భువనేశ్వరి ఈరోజు తిరుమలేశుని దర్శించుకున్నారు. రాత్రి చంద్రబాబు స్వగ్రామంలో బస చేయనున్న ఆమె రేపటి నుంచి జిల్లాలో మూడు రోజుల పాటు నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

రేపు చంద్రగిరి నియోజకవర్గం ఆగరాల వద్ద భహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత రెండు రోజులు తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును ప్రభుత్వం కక్ష్య కట్టి అక్రమంగా అరెస్టు చేశారనే అంశాన్ని ప్రజలకు తెలియచేయడమే భువనేశ్వరి బస్సు యాత్ర లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement