Sunday, April 28, 2024

AP: వీరబాబు, సుబ్బారావుల‌ కుటుంబాల‌కు భువ‌నేశ్వ‌రి ప‌రామ‌ర్శ‌…రూ.3 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అంద‌జేత

టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల్ని ఆమె పరామర్శిస్తున్నారు.

దీనిలో భాగంగా నేడు జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టిడిపి కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికసాయం కింద రూ.3లక్షల చెక్కును అందజేశారు.వారితో కొంత సేపు గ‌డిపిన అనంత‌రం ఆమె పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని కండ్ర‌కోట గ్రామానికి వెళ్లారు..టిడిపి కార్య‌క‌ర్త బుద్దాల సుబ్బారావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.. ముందుగా సుబ్బారావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు.. అనంత‌రం టిడిపి త‌రుపున సుబ్బారావు కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేశారు.. ఇక గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట.. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో భువ‌నేశ్వ‌రి పర్యటన కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement