Monday, April 29, 2024

AP : సీఎం జగన్ పై దాడి వెనుక చంద్ర‌బాబు… విజ‌య‌సాయిరెడ్డి

సీఎం జగన్ మీద జరిగిన దాడి వెనుక టీడీపీ నేతలు…చంద్రబాబు ఉన్నాడని నెల్లూరు వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జ‌గ‌న్ పై దాడి చేయ‌డం హేయమైన చర్య అన్నారు.

- Advertisement -

హింస ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా విశాఖపట్నంలో జగన్ పై జరిగిన దాడిపై చంద్రబాబు విపరీత అర్దాలను చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. అధికారం కోల్పోయి ఐదేళ్లు అయినా చంద్రబాబు పాఠాలు నేర్చుకోకుండా హింసా ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement