Monday, March 25, 2024

నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు శుక్రవారం ఉదయం హాజరు కానున్నారు . ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా విచారణ తేదీ ఖరారు కాకపోవడంతో అవినాష్‌రెడ్డికి విచారణకు హాజరయ్యేందకు గురువారం రాత్రి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. సీబీఐ పిలిచిన ప్రతిసారీ అవినాష్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ వేస్తూ, గడువు కోరుతూ విచారణను జాప్యం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు వివేకా హత్య కేసులో ఎంపీని సహ నిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరుకానున్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఎంపీ అనుచరులు భారీగా తరలివెళ్లారు

Advertisement

తాజా వార్తలు

Advertisement