Monday, April 29, 2024

AP: అధ్యాప‌క పోస్ట్ ల భ‌ర్తీకి ఎపిపిఎస్సీ నోటీఫికేష‌న్

అమ‌రావ‌తి – వివిధ క‌ళాశాల‌లో ఖాళీగా ఉన్న 240 అద్యాప‌క పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. బోటనీలో 19, కామర్స్‌లో 35, కెమిస్ట్రీలో 26, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 26, ఎకనామిక్స్‌లో 16, కంప్యూటర్‌ సైన్స్‌లో 31, ఎకనామిక్స్‌లో 16, గణితంలో 17, ఫిజిక్స్‌లో 11, పొలిటికల్ సైన్స్‌లో 21, జువాలజీలో 19 విభాగాల్లో పోస్టు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ పరీక్షలు రాసి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉన్న వారు మాత్రమే సంబంధిత విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల కనీస వయసు జులై 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలని తెలిపారు. కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరిన్ని వివరాలరకు https://psc.ap.gov.in/లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement