Sunday, May 5, 2024

Appointed – ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

ఢిల్లీ: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు నిన్న‌నే ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు.. అయ‌న స్థానంలో ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన ష‌ర్మిల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు.. ఇక గిడుగు రుద్ర‌రాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌నను కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement