Monday, May 6, 2024

AP: డీవీసీ హాస్పిట‌ల్‌ని ఎందుకు స్వాధీనం చేసుకోకూడ‌దో చెప్పండి.. ధూళిపాళ్లకు ప్రభుత్వం నోటీసులు

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ ప్రభుత్వం నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. వారం రోజుల్లోగా దీనికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆస్ప‌త్రి నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement