Sunday, May 5, 2024

AP & Telangana – దూసుకు వస్తున్న మరో తుపాన్

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‎తో పంటలు దెబ్బతిని.. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు.. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుండగానే.. గండం మరో తుఫాన్ రూపంలో ముంచుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. ఈ వార్నింగ్ బెల్స్‌ రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి..

తాజాగా మరో తుఫాన్ రైతులను భయపెడుతోంది. 24 గంటల్లో అల్పడనంగా ఏర్పడనుంది. ఈ తుఫాన్ వాతావరణం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల వైపు కదులుతున్నట్టుగా ఐఎండీ వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియాలో తుఫాన్ వాతావరణం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది మాల్దీవుల పక్కనే సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీంతో అల్పపీడనం ఏర్పడునున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement