Wednesday, May 1, 2024

AP – రేపే టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా విడుదల

అమరావతి – టీడీపీ-జనసేన పార్టీలు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. దీనిని అధికారికంగా రేపు ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీ అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చాయి ఉదయం 9 గంటలకు పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాకు ఉదయం 11:40 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. తొలి జాబితాలో 60 నుంచి 70 సీట్లకు ఇరు పార్టీల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది . ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు విడుదల చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం .

Advertisement

తాజా వార్తలు

Advertisement