Monday, April 29, 2024

AP – సింహ‌చ‌లం కేశ ఖండనశాల‌లో కూలిన శ్లాబ్ …

విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి. ఆ సమయంలో కేశఖండనం చేయించుకుంటున్న భక్తులు, సిబ్బంది త్రుటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం కావడంతో భక్తులు తక్కువగా రావడం, మధ్యాహ్నం కావడంతో భక్తులు ఎక్కువగా రాకపోవడంతో, సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement