ఏపీలో రాజకీయాలు వైసీపీ- టీడీపీ నేతల మధ్య విమర్శలు.. మాటల దాడి, ప్రతి దాడులు కొనసాగుతుంటే దీనికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆ పార్టీ బలంగా ఉన్న కోస్తా జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జనసేనాని. కనీసం 40-50 స్థానాల్లో సర్వే చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీడీపీతో జనసేన దోస్తీ కట్టనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కూడా జనసేనకు అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు రెడీ అన్నట్టుగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతోందో అని ఎన్నికల దాకా వెయిట్ చేయాల్సిందే మరి..