Wednesday, May 1, 2024

AP – అభివృద్ధి నిల్… అవినీతి ఫుల్ – జ‌గ‌న్ పై లోకేష్ ధ్వ‌జం

మూడు రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్‌ అని విమర్శించారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేశ్‌ మాట్లాడుతూ, ”మరో రెండు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదని. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకురావడం కాదు.. ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి. పాలిచ్చే ఆవును వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం. వైసీపీ ప్రభుత్వం తన్నే దున్నపోతు..తెలుగుదేశం పాలు ఇచ్చే ఆవు. ఇక్కడి నుంచి వైసీపీ మంత్రి బూడి ముత్యాలనాయుడిని గెలిపిస్తే.. ఉత్తరాంధ్రకు ఆయనేం చేశారు?ఐదేళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా.. ఒక్క గుంత అయినా పూడ్చారా? వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్‌.. అవినీతి ఫుల్‌. ఇష్టమొచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ -జనసేనను గెలిపించండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా.. పనిచేసేవాళ్లనే ప్రోత్సహిస్తాం. ప్రజల్లో ఉంటూ పనిచేసే వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తాం. బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి” అని లోకేశ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement