Sunday, April 28, 2024

AP టీడీపీ గూటికి మాజీ మంత్రి గుమ్మనూరు?


ఎప్పటి నుంచో కర్నూలు జిల్లా ఆలూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం సాగుతూ రాగా.. ఎట్టకేలకు మంగళవారం ఆయన టీడీపీలో చేరుతారని సమాచారం. ఆయన సిట్టింగ్‌ స్థానం మార్చిన తర్వాత.. కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.. ఇక, ఆ తర్వాత అనూహ్యంగా కేబినెట్‌ భేటీకి హాజరైన గుమ్మనూరు జయరాం టీడీపీ నేతలతో జత కలిశారని వార్తలు హల్ చల్ చేశాయి, మొత్తంగా మంగళవారం మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలుగుదేశం పార్టీలో చేరుతారని తెలుస్తోంది..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేస్తారని సమాచారం. ఇవాళ రాత్రికే విజయవాడ చేరుకోనున్నారని, ఇక, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను కూడా తనతోపాటు విజయవాడకు ఆహ్వానించారని, గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఖరారైందని గుమ్మనూరు ప్రచారం చేసుకుంటున్నారు.. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.. అయితే, రేపు ప్రకటించే టీడీపీ జాబితాలో గుమ్మనూరు జయరాం పేరు ఉంటుందా..? ఉండదా? అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement