Monday, April 29, 2024

FLASH: కృష్ణా నీరు దుర్వినియోగం: తెలంగాణపై KRMBకి ఏపీ ఫిర్యాదు

కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్‌ ఉత్పత్తికి సాగర్‌ నుంచి తెలంగాణ నీటి వినియోగం అడ్డుకోవాలని ఈ లేఖలో విన్నవించారు. తాగు నీటికి లేకుండా విద్యుత్‌ ఉత్పత్తికి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని తెలంగాణ దుర్వినియోగం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement