Friday, May 17, 2024

ప‌వ‌న్ వ్యాఖ్యాల‌పై ఎపి ప్ర‌భుత్వం సిరీయ‌స్ – కోర్టుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం

అమ‌రావ‌తి – వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామవాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నట్లుగా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కోర్టుకు వెళ్లేందుకు వీలుగా జివోను విడుద‌ల చేసింది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ వాలంటీర్ల‌పై దురుద్దేశ్యపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పరువుకు నష్టం కలిగించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అంటోంది. అంతేకాదు, వాలంటీర్లలోని మహిళలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు చేశారని చెబుతోంది. వారిని అవమానించేలా, విషపూరిత వ్యాఖ్యలు చేశారని చెబుతోన్న ప్రభుత్వం, ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement