Tuesday, May 14, 2024

AP – డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపు సమయం ముగియనున్న విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఫిబ్రవరి 25 రాత్రి 12గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకు టెట్కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పొడిగించినట్లు పేర్కొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement