Sunday, April 28, 2024

వంగ‌వీటి రాధా వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తున్నామ‌న్న ఏపీ డీజీపీ

టీడీపీ నేత వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన‌ వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని మాట్లాడలేమని, అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తెలిపారు.
అయితే ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు కోరిన విష‌యం విదిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement