Friday, April 26, 2024

ఏపీలో మరోసారి 2 వేలు దాటిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతున్నాయి.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 20 మంది చనిపోయారు. 1,807 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,59,154కు చేరింది. కాగా ప్రస్తుతం 21,279 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ వల్ల కృష్ణాలో ఆరుగురు, చిత్తూర్‌, ప్రకాశంలో నలుగురు, అనంతపూర్‌, తూర్పుగోదావరి, వైఎస్‌ఆర్‌ కడప, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇది కూడా చదవండి: కేఆర్ఎంబీ కి తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో లేఖ..

Advertisement

తాజా వార్తలు

Advertisement