Tuesday, April 30, 2024

AP – కాంగ్రెస్ కు ఎపిలో నోటాతోనే పోటీ – విజ‌య‌సాయి రెడ్డి

అమ‌రావ‌తి – కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఏపీలో నోటాతో కలిసి ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో 32,505 ఓట్ల తేడాతో నోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అన్నారు. గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటకల అనుభవంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఈజీగా చీలిపోతారని చెప్పారు. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు కూడా వేస్టేనని అన్నారు. ఎన్నికల్లో గెలిచే పార్టీకే ఓటు వేయాలని… వైసీపీకి ఓటు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement