Wednesday, May 1, 2024

AP – “రాజధాని ఫైల్స్” మూవీ చూడండి – ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు

అమరావతి: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు . అమ‌రావ‌తిపై విడుద‌లైన రాజాధాని ఫైల్స్ పై ఆయ‌న స్పందిస్తూ, ఇది ఒక విషాదమని ‘ఎక్స్‌'(ట్విటర్‌)లో ఆయన పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని దుయ్యబట్టారు. ఈ కుట్రలు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని పేర్కొన్నారు.

జగన్ క్రూరత్వానికి, వైకాపా విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో చూపించారని తెలిపారు. అందుకే ఈ చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. కానీ న్యాయస్థానంలో ఆ ఆటలు సాగలేదన్నారు. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూసి వాస్తవాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement