Friday, May 3, 2024

AP | రోడ్డు ప్రమాదంలో బిజెపి నేత మృతి

మనుబోలు- పొదలకూరు రోడ్డు మార్గంలో మడమనూరు జగనన్న లేఔట్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులురెడ్డి(43) దుర్మరణం పాలయ్యారు. ఇటీవల అయ్యప్పమాల వేసిన శ్రీనివాసులురెడ్డి జనవరి ఒకటిన స్నేహితులతో కలిసి శబరిమల వెళ్లి శనివారం ఉదయమే తిరిగి వచ్చాడు. స్వామివారి ప్రసాదాలను మిటాత్మకూరులో వున్న తన సోదరి పంట శైలజ కు ఇచ్చేందుకు మోటార్ సైకిల్ పై బయలుదేరాడు.

మడమనూరు జగనన్న లేఔట్ వద్ద రోడ్డుపై గుంట వుండడంతో బైక్ అదుపు తప్పి రోడ్డుకు తల బలంగా గుద్దుకుని పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడకక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై అజయ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులురెడ్డికి భార్య తేజస్విని, కుమార్తె జోషిత. కుమారుడు నిఖిల్ వున్నారు. శ్రీనివాసులురెడ్డి మృతికి బీజేపి, వైయస్సార్ సీపీ, టీడీపీ, జనసేన మండల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement