Sunday, April 28, 2024

AP – ఆరోప‌ణ‌లు రుజువు చేస్తే ఆస్తి మొత్తం రాసిస్తా – బాలినేని

ఒంగోలు – పేద‌ల కోసం కొన్న భూములకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయ‌ని, వాటిని రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజ‌రైన‌ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పారు.

నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పాన‌ని అన్నారు.. సీఎం జగన్ ఇచ్చిన భరోసా వల్లే ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాను అని ఆయన పేర్కొన్నారు. సీఎం వల్లే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సాకారమైంద‌ని ప్ర‌శంసించారు. గతంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం యర్రజర్లలో చూసిన ప్రభుత్వ భూమికి టీడీపీ అడ్డంకులు సృష్టించింద‌ని ఫైర్ అయ్యారు. అందుకే అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశామ‌ని, ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement