Monday, April 29, 2024

AP: మార్కెట్ కూల్చివేతపై కలెక్టర్‌తో అఖిలపక్షం భేటీ.. ధ‌ర్మ‌వ‌రంలో అస‌లేంజ‌రుగుతోంది..

Anantapuram: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒకటిన్నర ఎకరాల స్థలంలో సంవత్సరాల తరబడి కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్న దుకాణాల కూల్చివేత విషయంపై అఖిలపక్ష నాయకులు కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు. 40 మంది వ్యాపారులకు సంబంధించి ఒక్కరితో 10 లక్షల రూపాయలు గుడ్ విల్ తగ్గించుకునేందుకు ఇచ్చిన నోటీసులను మునిసిపాలిటీ అధికారులు ఉపసంహరించుకోవాలని కోరారు.

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తామని ప్రజలను అధికార పార్టీ నాయకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూల్చివేసిన మార్కెట్ ప్రాంతంలో మున్సిపాలిటీ తిరిగి షెడ్ లను ఏర్పాటు చేసి వ్యాపారులకు అనుమతివ్వాలని కోరారు. రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా వ్యాపారమే లేకపోతే 10 లక్షల రూపాయలు గుడ్ విల్ ఎక్కడి నుంచి తేవాలి అని ప్రశ్నించారు.

భాదితులకు న్యాయం చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందజేసిన వారిలో.. హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి,పరిటాల శ్రీరామ్.. అంబికా లక్ష్మీనారాయణ. సీపీఐ నేతలు మల్లికార్జున, ధర్మవరం కాటమయ్య, సీపీఎం నాయకులతోపాటు ప‌లువురు అఖిలపక్షం నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement