Monday, April 29, 2024

AP : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మాణం పాల‌య్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘ‌ట‌న కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర చోటుచేసుకుంది.

- Advertisement -

వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement