Monday, April 29, 2024

AP: ఆన్‌లైన్ గేమ్ కు మరొక యువకుడి బలి..

ఆన్‌లైన్ గేమ్ కు మరొక యువకుడు బలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సాత్విక్ అనే యువకుడు ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. అలా ఆడుతూనే సుమారు రూ.78 వేలు పొగొట్టుకున్నాడు. మరో విషయం ఏంటంటే సాత్విక్ మేనత్త దుబాయ్‌లో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపేది. అయితే ఈసారి సాత్విక్ తాత ఆపరేషన్ కోసమని రూ.78 వేలు ఫోన్‌కు పంపింది. కానీ సాత్విక్ ఆ డబ్బును ఆన్‌లైన్ గేమ్ ఆడి పోగొట్టాడు. దీంతో అతను ఇంట్లో తెలిస్తే ఏమంటారో.. కొడతారేమోననే భయాందోళనకు గురయ్యాడు. ఇక చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement