Sunday, April 28, 2024

AP: వైసీపీకి భారీ షాక్.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి గుంటూరు : వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. లోక్ సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఏపార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

శ్రీకృష్ణ దేవరాయలును నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. రాజీనామా చేసిన సందర్భంగా లావు మాట్లాడుతూ… పార్టీలో గత 15, 20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితికి తెరపడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదని, ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ, పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు. క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు.

గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. దీనివల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు. దీనికి తెరదించుతూ.. తాను ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని… ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు. ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించానని… ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నానని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement