Friday, May 3, 2024

AP: వైసీపీకి మరో షాక్.. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇవాళ విజయవాడలో నారా లోకేశ్ సమక్షంలో కర్నూలు వైసీపీ కీలక నేత కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి టీడీపీలో చేరారు.

ఆయనతో పాటు కుమార్తె కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మలత రెడ్డి, కుమారుడు అశోక్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ కుమార్ రెడ్డిలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోకేశ్ వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement