Wednesday, May 22, 2024

Andhra Pradesh – జ‌న‌సేన స్టార్ క్యాంపైన‌ర్లు వీరే …

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ స‌భ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది. వీరంతా రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement