Tuesday, May 21, 2024

ఏపీ కరోనా అప్ డేట్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,745 శాంపుల్స్ ని పరీక్షించగా 1,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,541 మంది కోలుకోగా.. ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,677గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 13,723కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,02,340కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 19,73,940 మంది కోలుకున్నారు. 

గడిచిన 24 గంటల్లో జిల్లా వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 29, చిత్తూరు జిల్లాలో 130, తూర్పుగోదావరి జిల్లాలో 105, గుంటూరు జిల్లాలో 116, కడప జిల్లాలో 32, కృష్ణాజిల్లాలో 99, కర్నూలు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 108, ప్రకాశం జిల్లాలో 122, శ్రీకాకుళం జిల్లాలో 42, విశాఖపట్నం జిల్లాలో 99, విజయనగరం జిల్లాలో 56, పశ్చిమగోదావరి జిల్లాలో 137 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

ఈ వార్త కూడా చదవండిః మన్యం వీరుడు అల్లూరి దాడికి వందేళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement