Sunday, April 28, 2024

Andhra Pradesh – 31న ఎపి కేబినేట్ మీటింగ్

అమరావతి – ఈ నెల 31న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ నెల 31న వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే మంత్రుల‌కు, అధికారుల‌కు స‌మాచారం అందించిన‌ట్టు పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులు తమ ప్రతిపాదనలను క్యాబినెట్ హ్యాండ్ బుక్ లో వివరించిన విధంగా నిర్ణీత ఫార్మాట్ లో పంపాలనీ, సాధారణ పరిపాలనకు సూచించిన సూచనల్లో జారీ చేసిన సూచనలతో సహా ఎప్పటికప్పుడు ఆదేశాలను పాటించాలని కోరారు.

కాగా, ఈ కేబినెట్ స‌మావేశంలో రాజ‌ధాని మార్పు, విశాఖ నుంచి పాల‌న కొన‌సాగించ‌డం స‌హా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా కీల‌క నిర్ణయాలు తీసుక‌కునే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇప్ప‌టికే ద‌స‌రా త‌ర్వాతి నుంచి విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించ‌నున్న‌ట్టు వైఎస్ఆర్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement