Friday, March 29, 2024

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీకి నిధుల సమీకరణ కోసం కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు సిద్ధమయ్యారు. అయితే భిక్షాటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదేవిధంగా జేసీ ప్రభాకర్ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జేసీ ఇంటి వద్దకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement