Friday, May 3, 2024

Ananatapur – మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ దీక్ష భగ్నం

కళ్యాణదుర్గం : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రెండు రోజులుగా అనంతపురం పరిధిలోని పాపంపేటలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. సునీత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ముఖ్య నేతలను అరెస్ట్‌ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

l

Advertisement

తాజా వార్తలు

Advertisement