Friday, May 17, 2024

వరద ముంపులోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంకా వరద ముంపులోనే ఉంది. రాజోలు దీవిలో వరద ఉధృతి కొన‌సాగుతోంది. టేకిశెట్టిపాలెం, అప్పనరాముని లంక, పాశర్లపూడి, అప్పనపల్లి కాజ్ వే లు మునిగిపోయాయి. 11రోజులుగా వరదముంపులోనే లంక గ్రామాలున్నాయి. మత్స్యకార కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. లంక గ్రామాలు వరద నీటిలో విలవిల్లాడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement