Thursday, April 25, 2024

Breaking: జగన్ కు అమరావతి షాక్.. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నో

పరిపాలనా రాజధానిగా విశాఖకు మార్చాలని తొందరపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నేడు సుప్రీంలో అమరావతి పిటిషన్లపై వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా అమరావతి పిటిషన్లను త్వరితగతిన విచారించాలని, హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు. అయితే ఆ వాదనలు విన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా త్వరితగతిన విచారించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. తదుపరి విచారణను ఏకంగా జులై 11వతేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement