Thursday, April 25, 2024

గంజాయి స్మగ్లర్ తో పాటు.. మరో ఐదుగురు అరెస్టు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): తిరుప‌తి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్య‌క్తితో పాటు మ‌రో అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతకాలంగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

తిరుపతి రూరల్ మండలం పద్మావతి పురానికి చెందిన సాదుహరి కొంతకాలంగా వైజాగ్ నుంచి తిరుపతికి గంజాయి తీసుకొచ్చి, ఇక్కడ విక్రయించేవాడు. సోమవారం అత‌డిని అరెస్టు చేసి అతని నుంచి 4 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగిందని తిరుచానూరు సీఐ సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఇతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement